BREAKING : సికింద్రాబాద్ అల్ఫా హోటల్‌ సీజ్‌

-

జంట నగరాల్లో ది ఫేమస్ హోటల్ అంటే ముందుగా గుర్తుచ్చే పేరు సికింద్రాబాద్ అల్ఫా హోటల్. ఇక్కడి చాయ్​కు.. ఇతర వంటలకు నగర వాసులు ఫిదా అవుతుంటారు. సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండటంతో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువే. అయితే తాజాగా జీహెచ్​ఎంసీ అధికారులు ఈ హోటల్​ను సీజ్ చేశారు. అపరిశుభ్ర వాతావరణంతో పాటు నాణ్యత లేని ఆహార పదార్ధాలను వినియోగదారులకు సరఫరా చేస్తుండటంతో అల్ఫా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు మూసివేయించారు.

ఈ హోటల్‌పై ఈ నెల 15వ తేదీన కొంత మంది ఫిర్యాదు చేయడంతో పాటు పలు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు హోటల్​ను తనిఖీ చేశారు. హోటల్‌ను పరిశీలించి కొన్ని శాంపిల్స్ సేకరించారు. అపరిశుభ్ర వాతావరణంలో వంట గది పరిసరాలను గుర్తించారు. సేకరించిన ఈ శాంపిల్స్‌ను నాచారంలోని స్టేట్‌ఫుడ్ ల్యాబోరేటరీకి పంపించారు. అయితే, ఆదివారం మరోమారు అధికారుల బృందం హోటల్‌ను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో కూడా హోటల్ యాజమాన్యం వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడం లేదని, పరిశుభ్రత పాటించడంలో నిర్లక్ష్యంగా ఉండటాన్ని గమనించారు. తదుపరి చర్యల కోసం యాజమాన్యం హోటల్‌ను మూసివేశారు.

Read more RELATED
Recommended to you

Latest news