మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిపోయిన బంగారం ధరలు

-

ఇండియాలో బంగారం ధరలు చుక్కలు చూపిస్తోన్నాయి. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఉండటంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది.

దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి బంగారం ధరలు కొండెక్కుతున్నాయి.

తాజాగా మరో సారి బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గి రూ. 46,100 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ. 50, 290 కి చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. కిలో వెండి ధర రూ. 200 కి తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.65,400 గా నమోదు అయింది.పెళ్లిళ్ల సీజన్‌ లో ఇలా బంగారం, వెండి ధరలు తగ్గడం మంచి పరిణామమని చెబు తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news