సెర్ప్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుండి పెంచిన జీతాలు అమలు

-

సెర్ప్ ఉద్యోగులకు పెంచిన జీతాలు ఏప్రిల్ నెల నుండి అమలు చేస్తామని ప్రకటించారు హరీశ్ రావు. జిల్లా మహిళా సమాఖ్య సంఘాల అధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన అంతర్ జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ,
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8 న రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మహిళ కొత్త కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభిస్తున్నది… మొదటి దశలో 100 మహిళా ఆసుపత్రులు కొత్తగా ప్రారంభిస్తున్నాము. వచ్చే రోజుల్లో 1200 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి వారంలో మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలి…మహిళా పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతున్నం. ఇవాళ 750 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version