యాదాద్రి ఓ అద్భుతం..కేసీఆర్‌ పై తెలంగాణ గవర్నర్‌ ప్రశంసలు !

-

యాదాద్రి ఓ అద్భుతం అంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ పై తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రశంసలు కురిపించారు. యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు ఆలయంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. పుష్కరిణి సందర్శన, దీపారాధన అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు గవర్నర్.

Governor of Telangana who visited Yadadri Lakshminarasimhaswamy and offered special pooja

ఇక గవర్నర్ కు వేద ఆశీర్వచనం నిర్వహించిన ఆలయ అర్చకులు, స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ స్వామి ఆలయ దర్శనం గొప్ప అనుభూతి ఇచ్చిందని తెలిపారు. మళ్ళీ దేవాలయ దర్శనానికి వస్తానని ప్రకటించారు. తెలంగాణ ప్రజలందరికీ నరసింహ స్వామి ఆశిషులు ఉండాలని కొరుకున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news