హైదరాబాద్ లో ఓటు వేసిన త్రిపుర గవర్నర్..!

-

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో త్రిపుర గవర్నర్ హైదరాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి సోమవారం ఉదయం 7 గంటలకు మలక్ పేట, సలీం నగర్ పరిధిలో జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్ లోని పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

త్రిపుర ఫస్ట్ లేడీ రేణుకా నల్లు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం హక్కు మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ దానిని బాధ్యతగా భావించి తప్పనిసరి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news