వస్తా..అన్నాడు, కానీ రాలేదు -సీఎం కేసీఆర్ పై గవర్నర్ సీరియస్ !

-

హైదరాబాద్‌: 75వ స్వాతంత్ర వేడుకల నేపథ్యంలో నిన్న గవర్నర్ నివాసంలో తేనేటి విందు కార్యక్రమం జరిగింది. అయితే గవర్నర్‌ తేనీటి విందుకు సీఎం కేసీఆర్…హాజరు కాలేదు. అటు ఎట్‌ హోమ్‌లో మంత్రులు, టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కనిపించలేదు. ఆఖరి నిమిషంలో ఎట్‌ హోమ్‌ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు సీఎం కేసీఆర్. అయితే దీనిపై తెలంగాణ గవర్నర్ తమిళ సై సీరియస్ అయ్యారు.

ఎట్ హోమ్ కి రావాలని నేను పర్సనల్ గా చీఫ్ జస్టిస్,సీఎం కేసిఆర్ కు లెటర్ రాశానన్నారు గవర్నర్ తమిళ సై. సీఎం కేసీఆర్ 6.55 వస్తారని సీఎంవో అదికారులు చెప్పారు..దాదాపు నేను,చీఫ్ జస్టిస్ 30 నిమిషాలు వెయిట్ చేశాము. Cmo నుండి మళ్ళీ ఎలాంటి సమచారం రాకపోవడం తో చాలా మంది వెయిట్ చేస్తున్నారని ప్రోగ్రాం ప్రారంభించామని వెల్లడించారు. సీఎం కేసిఆర్ ఎందుకు రాలేదో సీఎంవో ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news