జాతీయ మీడియాలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

-

BRS పార్టీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సాధించిన విజయాలపై ఇండియా టుడే గురువారం ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. గుడ్ న్యూస్ స్టోరీ పేరుతో ఈ కథనాన్ని ప్రసారం చేసింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే.

అత్యధిక మొక్కలు నాటడం ద్వారా ఈ కార్యక్రమం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కిన విషయాన్ని ఈ కథనంలో ప్రస్తావించారు. అమితాబచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి అనేకమంది సెలబ్రిటీలు ఇందులో భాగస్వామ్యమైనట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమం వల్ల తెలంగాణలో పచ్చదనం పెరిగినట్టు కథనం పేర్కొంది. రాజు దీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ… ఈ కార్యక్రమం మరింత విజయవంతం కావాలని, మరింత మంది ఎంపీలు, సెలబ్రిటీలు పాల్గొని విస్తృతం చేయాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు ఇండియా టుడేకు, రాజ్ దీప్ సర్దేశాయ్ కు ఎంపీ సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news