6,200 మంది పార్ట్‌ టైం లెక్చరర్లు, టీచర్ల తొలగింపు…హరీష్ రావు సీరియస్ !

-

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్‌ టైం లెక్చరర్లు, టీచర్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి గారు? అని ఫైర్ అయ్యారు. సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పని చేస్తున్న 6,200 మంది పార్ట్‌ టైం టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలు (DEOs) ను ఏకకాలంలో విధుల నుండి తొలగించడం దుర్మార్గమైన చర్య. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

మూడు నెలలుగా జీతాలు చెల్లించరు, అడిగినందుకు ఉద్యోగాల నుండి తొలగిస్తారు. ఇదేనా మీ ప్రజా పాలన? ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం? అని ఆగ్రహించారు. విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను తొలగించి వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల బతుకులను ఆగం చేశారని మండిపడ్డారు. మరోవైపు మీ నిర్లక్ష్య, అర్థం లేని నిర్ణయం వల్ల వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news