బీఆర్ఎస్ నేతల కిడ్నాప్‌ యత్నంపై హరీష్‌ రావు సీరియస్‌ !

-

బీఆర్ఎస్ నేతల కిడ్నాప్‌ యత్నంపై హరీష్‌ రావు సీరియస్‌ అయ్యారు. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సోషల్‌మీడియా వేదికగా సీరియస్‌ అయ్యారు.

బీఆర్ఎస్ కార్పొరేటర్లపై జరుగుతున్న ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ డీజీపీ, గారు వెంటనే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలా దాడులకు పాల్పడడం గర్హనీయం. ఇలాంటి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news