గోదావరి పుష్కరాల కోసం ఏపీకి 100 కోట్లు… తెలంగాణకు గుండు సున్నా – హరీష్‌ రావు

-

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు 100 కోట్లు ఇచ్చి, తెలంగాణకు గుండు సున్నా మిగిల్చిందని… తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయారని ఆగ్రహించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయి. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఉండి ఉంటే, తెలంగాణకు అన్యాయం జరిగేది కాదని తెలిపారు.

harish rao

కేంద్ర బడ్జెట్లోనూ తెలంగాణకు సున్నా కేటాయింపులు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు అడిషనల్ గ్రాంట్ కింద 15,000 కోట్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చారని మా బాధ కాదు, తెలంగాణకు అన్యాయం జరుగుతోందనేదే మా ఆవేదన అన్నారు హరీష్‌ రావు. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మొదటి నుండి మొండి చెయ్యే. తెలంగాణ రాష్ట్రం పట్ల ఇంత వివక్ష ఎందుకు? అని ప్రశ్నించారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని, హక్కుగా రావాల్సిన నిధులను కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news