ఇది ప్రజాపాలన కాదు. “అప్రజాస్వామ్యపాలన” – హరీష్‌ రావు సీరియస్‌

-

ఇది ప్రజాపాలన కాదు. “అప్రజాస్వామ్యపాలన” అంటూ హరీష్‌ రావు సీరియస్‌ అయ్యారు. హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా టిజిపిఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పోస్ట్‌ పెట్టారు హరీష్‌ రావు.

harish rao on ap pensions

సోకాల్డ్ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా? తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదా? ఒక వైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ, నిరుద్యోగుల గొంతులను, హక్కులను అణగదొక్కే కుట్రలకు పాల్పడుతున్నది రేవంత్ సర్కారు అంటూ నిప్పులు చెరిగారు. ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు. “అప్రజాస్వామ్యపాలన.” అని మండిపడ్డారు.

ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థికి తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని… ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే విద్యార్థులకు నిరుద్యోగులకు తోడు ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించే దాక, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టం. విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున గొంతెత్తుతాం…. నిర్వారామ పోరాటం చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news