బండి, కిషన్ రెడ్డి ఇద్దరూ దివాలా కోరు, దిక్కుమాలిన నాయకులు – హరీశ్ రావు

-

బీజేపీ పార్టీపై మరోసారి హరీష్ రావు విరుచుకుపడ్డారు. కేసీఆర్ సభలో బిజెపి నాయకులకు కంటి మీద కునుకు లేకుండా అయ్యిందని.. కేసీఅర్ సభ తర్వాత బిజెపి నాయకులు స్థాయినీ మరిచి పిచ్చి పిచ్చి గా మాట్లాడారని ఎద్దేవా చేశారు. దివలకొరు, దిక్కుమాలిన నాయకులని బండి సంజయ్, కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు హరీష్‌ రావు.

ఈ ఇద్దరి నేతల స్థాయి ఏంటో ఢిల్లీ నుంచి వచ్చిన దూతలు ఏమి చెప్పారో విన్నామన్నారు. బండి సంజయ్ ,కిషన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక్క నిజం లేదు మునుగోడులో 99 శాతం మందికి కేసీఅర్ సర్కార్ ఫలాలు అందాయని వివరించారు. కేంద్రం మీటర్లు పెట్టమని రాష్ట్రానికి లేఖలు రాసిందని… మరి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం అంటారు ? అని నిలదీశారు.

కిషన్ రెడ్డి కేంద్రం నుంచి 30 వేల కోట్లు తీసుకురావాలని… బండి సంజయ్, కిషన్ రెడ్డి లు మనుషులేనా ? అని ఆగ్రహించారు.నేను చేనేత GST మీద సంతకం పెట్టిన అని అంటున్నారు …అది పచ్చి అబద్ధమన్నారు. చేనేత పై GST ని తెలంగాణ ప్రభుత్వం మినహాయించాలని కోరిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news