అమరుల త్యాగం.. అజరామరం : మంత్రి హరీశ్

-

నేడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది తెలంగాణ అమరుల స్మారకం. ఇవాళ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా మ. 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. అయితే.. తెలంగాణ అమరుల స్మారకం ప్రారంభం కానున్న తరుణంలోనే.. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌ రావు స్పందించారు.

అమరుల త్యాగం.. అజరామరం అన్నారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణ త్యాగం చేసిన అమరులకు వినమ్ర శ్రద్ధాంజలి ప్రకటించిన ఆయన… తెలంగాణ ప్రగతిలో ప్రకాశిస్తున్నది మీ త్యాగనిరతి అని తెలిపారు. అమరుల త్యాగం.. అజరామరం అని.. అమరుల స్ఫూర్తి.. ప్రజ్వలిత దీప్తి ఉద్యమ ధ్రువ తారలకు ఘన నివాళి…. జై తెలంగాణ అంటూ పోస్ట్‌ పెట్టారు. ఆధ్యాత్మికతను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version