హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు రీఓపెన్ చేయాలని డీజీపీ నిర్ణయం

-

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కేసు మలుపు తిరిగింది. దర్యాప్తును కొనసాగించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ వ్యవహారంలో వర్సిటీ వీసీతోపాటు పలువురు నేతలపై దాఖలైన కేసులో ఆధారాల్లేవంటూ తాజాగా హైకోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించగా.. ఆ నివేదికపై రోహిత్‌ తల్లి అనుమానాలు వ్యక్తం చేయడం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో పోలీసుశాఖ ఈ కేసును రీ ఓపెన్ చేయాలని నిర్ణయించింది.

వేముల రోహిత్‌ 2016లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, హెచ్‌సీయూ విద్యార్థులు అప్పట్లో పెద్దఎత్తున ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.  ఆత్మహత్యపై అప్పట్లో సైబరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేసి 2023 నవంబరులో తుది నివేదిక రూపొందించారు. ఈ ఏడాది మార్చి 21న దర్యాప్తు అధికారి ఆ నివేదికను న్యాయస్థానానికి సమర్పించగా.. ఈ అంశంపై తాజాగా మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో ఈ కేసును పునర్విచారించాలని డీజీపీ రవిగుప్తా శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని పోలీసులు అభ్యర్థించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news