దారుణం.. ఆస్తి కోసం భర్తను గొలుసులతో బంధించి టార్చర్ చేసిన భార్య

-

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మహిళ తన భర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలు పెట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు అతడికి విముక్తి కల్పించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఘట్‌కేసర్‌లోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన సెంట్రింగ్‌ గుత్తేదారు పత్తి నరసింహ (50), భార్య భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భార్య పేరిట ఉన్న స్థలంలో ఇల్లు కట్టేందుకు అప్పులు చేశాడు నరసింహ. ఆ అప్పు చెల్లించేందుకు తన పేరు మీదున్న మరో స్థలాన్ని అమ్ముదామని భార్యతో చెప్పగా.. ఆమె వద్దని వారించింది. ఈ విషయంలో ఇద్దరికి గొడవలు మొదలయ్యాయి. సంవత్సరం క్రితం ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోగా.. గత నెల 30న నరసింహ యాదాద్రి భువనగిరి జిల్లా పడమటి సోమారంలో ఉన్నట్లు తెలుసుకున్న భారతమ్మ .. కుమారులతో కలిసి వెళ్లి భర్తను ఇంటికి తీసుకొచ్చి నరసింహను గదిలో వేసి ఇనుప గొలుసులతో కట్టేసి తాళం వేసింది.

మూడు రోజులుగా ఇంటి‌ స్థలం తన‌ పేరిట‌ రిజిస్ట్రేషన్ చేయాలని అతడిని చిత్రహింసలు పెట్టింది. ఈ దృశ్యాన్ని స్థానికులు రహస్యంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి మాజీ ఎంపీటీసీ సభ్యుడు మహేశ్‌ దృష్టికి తీసుకెళ్లారగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడికి వెళ్లి నరసింహను విడిపించింది అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news