సీఎం రేవంత్ ను కలిసిన వేముల రోహిత్ తల్లి రాధిక

-

హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసును రాష్ష్ర హైకోర్టు క్లోజ్ చేసింది. తనని దళితుడని అవమానించినందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు లేవని పోలీసులు సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేసును ముగించింది. అయితే ఈ కేసుపై రోహిత్‌ తల్లి అనుమానం వ్యక్తం చేయడం, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పునర్విచారణకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేయాలని రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో తాజాగా రోహిత్ తల్లి రాధిక సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తన కుమారుడి మరణం కేసులో న్యాయం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో న్యాయం జరిగినప్పుడే తన కొడుకు ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు. రాధిక విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసును రీ ఓపెన్ చేసేందుకు డీజీపీ రవిగుప్తా రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news