నేడు ప్రజా పాలన దినోత్సవం.. సీఎం రేవంత్ షెడ్యూల్ ఇదే

-

శాసనసభ, మండలిలో ప్రజాపాలన దినోత్సవం జరుగనుంది. ప్రజాపాలన దినోత్సవం నేపథ్యంలో జాతీయ జెండా ఎగురవేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు 9.30 కి జూబ్లీహిల్స్ నివాసం నుండి పబ్లిక్ గార్డెన్స్ బయలుదేరనున్నారు సిఎం రేవంత్ రెడ్డి. గన్ పార్క్ లో అమర వీరుల స్థూపం దగ్గర నివాళి అర్పించనున్నారు.

Henceforth every year September 17 is to be observed as public governance day, gazette release

10 గంటలకు పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండా ఎగరేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17 ను అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇకపై ప్రతి ఏటా.. సెప్టెంబర్ 17 ను ప్రజా పాలన దినోత్సవం గా నిర్వహించాలని గెజిట్ విడుదల చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.

 

Read more RELATED
Recommended to you

Latest news