హై కోర్టులో వేణు స్వామికి ఊరట..!

-

సెలబ్రెటీల జాతకాలు చెబుతూ ఫెమస్ అయిన వేణు స్వామికి హై కోర్టులో ఊరట లభించింది. అయితే తాజాగా వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యే ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగ చైతన్య, శోభితల భవిష్యత్ పై వేణు స్వామి ఓ వీడియో విడుదల చేసాడు. అందులో వారిద్దరూ విడిపోతారంటూ పేర్కొన్నాడు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో.. వేణు స్వామిపై విమర్శలు వచ్చాయి.

అలాగే ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ వేణు స్వామిపై ఫియదు చేయడంతో.. ఆగస్టు 22న వేణు స్వామి తమ ముందు హాజరు కావాలని మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. కానీ తనకు వచ్చిన నోటీసులపై హై కోర్టుకు వెళ్ళాడు వేణు స్వామి. అయితే వేణు స్వామికి ఎందుకు నార్తీసులు పంపారంటూ మహిళా కమిషన్ ను ప్రశ్నించిన హై కోర్టు.. తాజాగా ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వేణు స్వామి పిటీషన్ పై స్టే విధించిన హై కోర్టు.. ఆయన మహిళా కమిషన్ ముందు హాజరు కావలసిన అవసరం లేదు అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news