తెలంగాణ హైకోర్టులో హరీశ్ రావుకు ఊరట లభించింది. హరీశ్ రావుపై నమోదైన ఎన్నికల పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు. ఎన్నికల సమయంలో సరైన వివరాలు వెల్లడించలేదని పిటిషన్ వేశారు చక్రధర్ గౌడ్. హరీశ్ తరఫున వాదనలు వినిపించారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు.

ఈ తరుణంలోనే తెలంగాణ హైకోర్టులో హరీశ్ రావుకు ఊరట లభించింది. అటు కాళేశ్వరం విచారణ ముగిసిన తర్వాత హరీష్ రావు మాట్లాడారు. తుమ్ముడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషన్ కు వివరించామని పేర్కొన్నారు. వ్యాప్కోస్ సూచన మేరకు, CWC నివేదిక మేరకు, మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కారణంగా ఆనాడు బ్యారేజ్ ప్రాంతాన్ని మార్చమని కమిషన్కు తెలియజేశానన్నారు హరీష్ రావు.