గుడ్ న్యూస్.. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి హైకోర్టు అనుమతి

-

జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి హైకోర్టు అనుమతి లభించింది. సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తకి హైకోర్టు దిసభ్య ధర్మాసనం అనుమతి ఇచ్చింది. గతేడాది నిర్వహించిన పరీక్షలో మార్కుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలని సూచించింది.

High Court permission to fill the posts of Junior Assistant
High Court permission to fill the posts of Junior Assistant

పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. కాగా, ఈ పరీక్షకు 77,907 మంది హాజరు కాగా… వీరిలో 49,328 మంది అభ్యర్థులు కనీస మార్కులు సాధించారు. కాగా… సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. దసరా పండుగ వస్తున్న తరుణంలోనే… సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త అందించింది. 11 వ వేజ్‌ బోర్డు ఏరియర్స్‌ విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగానే… మొత్తం 39,413 మంది సింగరేణి ఉద్యోగులకు రూ. 1,450 కోట్లు జమ చేసింది తెలంగాణ సర్కార్. ఇక నిన్న సాయంత్రం నుంచి కార్మికుల బ్యాంక్‌ ఖాతాలో ఏరియర్స్‌ జమ చేసినట్లు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news