చిక్కడ పల్లి లైబ్రరీ వద్ద హై టెన్షన్.. గ్రూపు 1 అభ్యర్థులు అరెస్ట్

-

హైదరాబాద్ లోని చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్ నగర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.ఎక్కడికక్కడ పోలీస్ వ్యాన్ లు, జీపులు భారీ బందోబస్తుతో పోలీసులు ఉన్నారు. గ్రూప్-1 అభ్యర్థులు ఏ క్షణం ధర్నాలు, నిరసనలు చేసిన అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు వాతావరణం కన్పిస్తోంది. ఈ నెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని, గతంలో జరిగిన ప్రిలిమ్స్  పరీక్షల్లో తప్పులు జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.

రెండో రోజు కూడా అభ్యర్థులు ధర్నాలు కంటిన్యూ చేస్తున్నారు. ముషీరాబాద్ గాంధీ నగర్ పార్కులో గ్రూప్ 1 అభ్యర్థులు శాంతియుత నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సాయంత్రం చిక్కడపల్లి లైబ్రరీ వద్ద అభ్యర్థులు ధర్నాకు రెడీ అయినట్లు సమాచారం రావడంతో పోలీసులు లైబ్రరీ వద్దకు చేరుకుని
నిరసన అడ్డుకునేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు పొడవైన భారీ కర్రలతో పోలీసులు లైబ్రరీ వద్ద తిరుగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news