Hyd: కుక్క తరమడంతో 3వ అంతస్తు నుండి పడి వ్యక్తి మృతి !

-

 

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. చందానగర్లో కుక్క తరమడంతో 3వ అంతస్తు నుండి పడి వ్యక్తి మృతి చెందాడు. చందనగర్ పీఎస్ వీవీ ప్రైడ్ హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి..ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం స్నేహితులతో కలిసి సరదాగా హోటల్ కి తెనాలికి చెందిన ఉదయ్..వచ్చాడు.

A man died after falling from the 3rd floor after being chased by a dog

మూడో అంతస్థులోకి రాగానే బాల్కనీలో ఓ కుక్క.. తరిమింది. ఏం చెయ్యాలో తోచక భయాందోళనకు గురై, కిటికి నుండి దూకాడు ఉదయ్. తీవ్ర గాయాలైన ఉదయ్ ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.. సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు…రికార్డ్ అయ్యాయి. ఆదివారం రాత్రి ఘటన జరగడం సోమవారం రాత్రి వరకు బయటకి పొక్కకుండా జాగ్రత్త పడ్డారట.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version