భార్య కాపురానికి రావడం లేదని ఉరివేసుకున్న భర్త..!

-

మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉరి వేసుకుని రహీం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మియాపూర్ బస్సు బాడీ బిల్డింగ్ దగ్గర చెట్టుకు ఉరి వేసుకొని రహీం మృతి చెందాడు. తన భార్య కాపురానికి రావడం లేదు మనస్థాపానికి గురి అయ్యి ఉరివేసుకున్న రహీం. వీరిద్దరిది ప్రేమ వివాహం అని తెలిపిన పోలీసులు.. తరచూ వీరి మధ్య గొడవలు కావడంతో భార్య అతనికి దూరం ఉంటుంది. రహీం శ్రీశైలం వాసి, శ్రీశైలంలో ఆటో డ్రైవర్ గా పని చేసేవాడు.

రహీం పై స్థానిక పోలీస్ స్టేషన్లో 498 కేసు కూడా నడుస్తుంది అని తెలిపిన పోలీసులు.. తనపై 498/A కేసు నడవడంతో మనస్థాపానికి గురైన అర్థ రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రహీం. గొడవల కారణంగా భార్య అరవిందు ఫార్మసీలో లేబర్ పని చేసుకుంటూ ఓ ప్రవేట్ హాస్టల్లో ఉంటుంది. తన భార్యకు కనబడేలా హాస్టల్ పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు రహీం. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించిన పోలీసులు.. పూర్తి వివరాలు తెలియాల్సివుంది అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version