Hyd: ట్యాంకర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి

-

Hyd: ట్యాంకర్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారట. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాచుపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు టీ తాగేందుకు వెళ్తున్నామని వార్డెన్ కు చెప్పి..బయటకు వచ్చారు.

Hyderabad 3 engineering students killed in car crash

మార్గంమధ్యలో దుండిగల్ ఎగ్జిట్ నంబర్ – 5 సమీపంలో మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను కారు ఢీ కొట్టింది. కారు నడుపుతున్న అక్షయ్ తో పాటు అస్మిత్, హరి అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని తెలిపారు పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news