మెట్రో రైలు విస్తరణ 70 కి.మీ.. కొత్త రూట్‌మ్యాప్‌ రూపొందించిన అధికారులు

-

హైదరాబాద్‌లో మెట్రో ఫేజ్-2 విస్తరణకు కొత్తగా రూట్ మ్యాప్ను అధికారులు సిద్ధం చేశారు. నగరం నలుమూలాల నుంచి విమానాశ్రయానికి వెళ్లేలా కొత్త ప్రతిపాదిత మార్గాలను తయారు చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో  70 కిలోమీటర్లు అందుబాటులో ఉంది. ఫేజ్ 2 విస్తరణలో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రెండో కారిడార్‌ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగించనున్నారు. మరో 4 కారిడార్లలో మెట్రో రైలు మార్గాన్ని సిద్ధం చేయనున్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు ఐదున్నర కిలోమీటర్లు పొడిగిస్తూ.. అలాగే ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు కిలోమీటరున్నర మేర విస్తరించాలని నిర్ణయించారు.

కారిడార్-4లో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు మీదుగా మైలార్ దేవ్‌పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వరకు మొత్తం 29 కిలోమీటర్ల వరకు కొత్తగా మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు.

ఇదే కారిడార్‌లో మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు 4 కిలోమీటర్లు రూట్ మ్యాప్ రెడీ చేశారు.

కారిడార్ -5లో రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్‌రాంగూడ జంక్షన్, విప్రో జంక్షన్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లోని అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మెట్రోమార్గం అందుబాటులోకి రానుంది.

కారిడార్ – 6లో  మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్‌చెరు వరకు 14 కిలోమీటర్లు మెట్రో మార్గాన్ని విస్తరించనున్నారు.

కారిడార్- 7లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్‌నగర్ వరకు 8 కిలోమీటర్లు కొత్తగా మెట్రోరైలు మార్గానికి రూట్ మ్యాప్‌ సిద్ధం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version