పంద్రాగస్టుకు ఐబి హెచ్చరికలు.. తెలంగాణ పోలీసులు అప్రమత్తం

-

దేశ రాజధాని ఢిల్లీ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఆగస్ట్‌ 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అంతేకాదు.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది.

ఇక పంద్రాగస్టు కు ఐబి హెచ్చరికల నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. లష్కరే తాయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరిక జారీ చేసింది. దేశ రాజధాని పాటు.. కీలక నగరాలను పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది కేంద్ర నిఘా వర్గాలు. దీంతో హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించింది పోలీస్ శాఖ. శంషాబాద్ విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, బస్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘాను ముమ్మరం చేశారు. అటు శంషాబాద్ విమానాశ్రయంలో ఈ నెల 30 వరకు హైఅలెర్ట్ కొనసాగిస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news