మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు.. కన్నీరు పెట్టుకుంటున్న బాధితులు !

-

హైదరాబాద్లో మరోసారి హైడ్రా కూల్చి వేతలు కొనసాగుతున్నాయి. మాదాపూర్, సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అపార్ట్మెంట్‌ను ఇవాళ ఉదయం కూల్చివేశారు హైడ్రా అధికారులు. దీంతో తమ ఇల్లు కూలుస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు ఓ మహిళ. అంతేకాదు.. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ పై నిప్పులు చెరిగారు.

HYDRA officials demolished the apartment under Madapur and Sunnam Cheruvu FTL

కేసీఆర్ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెస్తే నువ్వు మా కడుపు కొట్టడానికే మా ఇల్లు కూలగొడ్తున్నావ్ అంటూ రెచ్చిపోయారు బాధిత మహిళ. ఈ సంఘటన అందరినీ కలిచివేస్తోంది. కోర్టుకు పోవడానికి వీలు లేకుండా వారాంతాల్లో మాత్రమే ఉండేలా హైడ్రా కూల్చివేతలు జరుగున్నాయని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. మరి దీనిపై హైడ్రా అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news