నా భార్య టార్చర్ చేస్తోంది.. పోలీసులకు ఐఏఎస్‌ అధికారి ఫిర్యాదు

-

తన భార్య.. మామ, బామ్మర్దిలతో కలిసి తనను దారుణంగా వేధిస్తోందంటూ ఓ ఐఏఎస్ అధికారి పోలీసులను ఆశ్రయించారు. భార్య, మామా, బామ్మర్దిల వేధింపులతో నరకం చూస్తున్నానంటూ తన గోడంతా పోలీసుల వద్ద వెల్లబోసుకున్నారు ఐఏఎస్‌ అధికారి సందీప్‌కుమార్‌ ఝా. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2021 నవంబరులో సందీప్‌కుమార్‌ ఝా, పల్లవి ఝా వివాహం జరిగింది. భార్య, మామ, బామ్మర్ది తనను మానసికంగా, భౌతికంగా ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. తన పేరిట ఉన్న ఆస్తులను బదలాయించాంటూ ఒత్తిడి తెచ్చారని, గృహహింస, వరకట్న కేసులు నమోదు చేస్తామంటూ భార్య బెదిరించారని చెప్పారు. ఈ మేరకు ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, భార్య పల్లవి తన భర్త అసహజ శృంగారానికి పాల్పడుతున్నారని, వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారని ఛత్తీస్‌గఢ్‌లో ఫిర్యాదు చేయడంతో అక్కడి న్యాయస్థానం సూచనల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news