భూ వివాదంలో పురుగుల మందు తాగి రైతు సెల్ఫీ సూసైడ్..!

-

తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఇలాంటి ఆత్మహత్యలు ఉండవని పలువురు నేతలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలో టీఆర్ఎస్ వచ్చింది. అనంతరం బీఆర్ఎస్ గా మారింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులు అవస్థలు పడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో కూడా రైతులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు.

తాజాగా ఓ రైతు భూ వివాదంలో పురుగుల మందు తాగి సెల్ఫీ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట (మం) సుతార్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో స్వామికి కొన్నాళ్లుగా భూ వివాద సమస్య నెలకొంది. ఈ భూ వివాదంలో గ్రామానికి చెందిన కొందరు తలదూర్చి చంపేస్తామని బెదిరిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వాళ్ళు చంపేయక ముందే నేనే చనిపోతానని.. నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు రైతు స్వామి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే మరణించాడు రైతు స్వామి.

Read more RELATED
Recommended to you

Exit mobile version