అమీర్ పేట మెట్రో స్టేషన్ లో గోల్డ్ ఏటీఎం ప్రారంభం

-

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సాధారణంగా బంగారాన్ని ఎవ్వరైనా షాపుల్లో కొనుగోలు చేస్తుంటారు. షాపుల్లో కొనడానికి షాపుల వద్దకు వెళ్లే తీరిక కూడా కొంత మందికి ఉండదు. అలాంటి బంగారం ప్రియులకు ఇప్పుడు  గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ సిస్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో అమీర్ పేట మెట్రో స్టేషన్ ప్రాంగణంలో గోల్డ్ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు.

ముఖ్యంగా 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని ఈ ఏటీఎం ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డు లేదా యూపీఐ పేమెంట్ ద్వారా బంగారు, వెండి కాయిన్లను కొనుగోలు చేయవచ్చు. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఏటీఎంలో డబ్బులు తీసుకున్న విధంగానే గోల్డ్ సిస్కా ఏటీఎంలో బంగారు, వెండి కాయిన్లు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఏటీఎం లలో నిర్దేశించిన విధంగానే లావాదేవి పూర్తయిన వెంటనే మనం ఎంచుకున్న బంగారం కాయిన్లు బయటికి వస్తాయి. ఈ అవకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news