ఈ నెల 25న సచివాలయ గుడి, చర్చి, మసీదు ప్రారంభం

-

ఈ నెల 25న సచివాలయంలో దేవాలయం, మజీద్, చర్చిలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ తరుణంలో ఆ పనులను పరిశీలించారు ఆర్&బి ఇఎన్సీ గణపతి రెడ్డి, ఇతర అధికారులు. ఈ సందర్భంగా ఆర్&బి శాఖ ఇఎన్సీ గణపతి రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గుడి, మజీద్, చర్చి పనులను పరిశీలించామని..అన్ని పనులు పూర్తి అయ్యాయని వెల్లడించారు.

చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవి కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి అవుతాయి…మత పెద్దలు, పూజారుల సలహాలు సూచనలు పాటిస్తూ నిర్మాణం చేశామని పేర్కొన్నారు. ఈ నెల 25న భక్తులకు గుడి అందుబాటులోకి రానుందని…మజీద్, చర్చి కూడా అదే రోజు ప్రారంభమవుతుందని చెప్పారు. సచివాలయం ఉద్యోగులకు గుడి, మజీద్, చర్చి అందుబాటులోకి వస్తుంది…పనులు అన్ని శరవేగంగా జరుగుతున్నాయన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news