Hyderabad: అమెరికాలో మిస్సైన హైదరాబాద్ యువకుడు మృతి

-

Hyderabad: అమెరికాలో మిస్సైన హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీలో మాస్టర్స్ కోసం 2023లో అమెరికా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల విద్యార్థి మృతి చెందినట్లు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ఈరోజు తెలిపింది.

Indian Student, 25, Found Dead In US, Went To Ohio In 2023 For Masters

మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ దాదాపు మూడు వారాలుగా తప్పిపోయాడన్న సంగతి తెలిసిందే. అబ్దుల్ కుటుంబంతో తాము టచ్‌లో ఉన్నామని.. అతనిని గుర్తించడానికి స్థానిక చట్ట అమలు సంస్థలతో కలిసి పని చేస్తున్నామని కాన్సులేట్ ఇంతకుముందు తెలిపింది. కానీ ఈ రోజు ఉదయం, మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ చనిపోయాడని రాయబార కార్యాలయం తెలిపింది. ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ చనిపోయినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news