కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్న మాట వాస్తవం : ఈటల

-

సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న మాట వాస్తవమేనని అన్నారు. విశ్వాసానికి మారు పేరు మోదీ అయితే.. విశ్వాస ఘాతకానికి మారు పేరు సీఎం కేసీఆర్ అని విమర్శించారు. కవితను గెలిపిస్తే 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెప్పిస్తామన్న కేసీఆర్.. ఈనాటికి కూడా ఫ్యాక్టరీ ఓపెన్ కాలేదని మండిపడ్డారు.


రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదని.. అయినా తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా ప్రధాని మోడీ ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేశారని ఈటల ప్రశంసించారు. 2005లో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో సిద్దిపేట సికింద్రాబాద్ రైల్వే లైన్ కోసం అప్పటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రూ.350 కోట్ల రూపాయలు పెట్టారని.. అయితే 2016 వరకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని దుయ్యబడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news