ఎమ్మెల్యే కంటే రెట్టింపు అభివృద్ధి చేస్తా.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఎమ్మెల్యే కంటే రెట్టింపు అభివృద్ధి చేస్తా.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ  సారంగాపూర్ మండలం లో పర్యటించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో నేనంటే గౌరవం ఉంది నా మాట ఎవరు కాదనరు అని పేర్కొన్నారు. ఎన్నికలలో గెలుపు ఓటములు నాకు సహజం అని తెలిపారు.

ప్రజలు నాకు ఏ బాధ్యతలు అప్పగించిన ఆ హోదాలో నా బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు. నేను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే.. పెద్ద స్థాయిలో బాధ్యతలు వచ్చి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండలేకపోవచ్చు. కానీ జగిత్యాల నియోజకవర్గానికి అను నిత్యం, అందుబాటులో ఉండి, నా సేవలు అవసరమని దేవుడు నన్ను ఈ నియోజకవర్గానికే పరిమితం చేసాడు. ప్రభుత్వం లో నేను అంటే గౌరవం ఉంది, నా మాట ఎవరు కాదన్నారు. ఎమ్మెల్యే గా గెలుస్తే జగిత్యాల నియోజకవర్గాన్ని ఎంత అబివృద్ది చేస్తానో, అంతకు రెట్టింపు అబివృద్ది చేస్తానని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news