రేవంత్‌ రెడ్డి నిజమైన సముద్రగర్భ-భూగర్భ-ఖగోళ శాస్త్రవేత్త – బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

-

రేవంత్‌ రెడ్డి నిజమైన సముద్రగర్భ-భూగర్భ-ఖగోళ శాస్త్రవేత్త అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి సెటైర్లు పేల్చారు. తెలంగాణ ను, హైదరాబాద్ ను, మూసి ని కఠోర తపస్సు చేసి కనుగొన్న సముద్రగర్భ-భూగర్భ-ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆచార్య శ్రీ శ్రీ శ్రీ రేవంత్ రెడ్డి జీ ,,, మూసీ పుట్టుక భూగోళం పుట్టుకతో నే ప్రారంభం అయిందని చురకలు అంటించారు జగధీశ్‌ రెడ్డి. ఆ తర్వాత లక్షల సంవత్సరాల కి దాని వెంట మానవ ఆవాసాలు వచ్చినై, నువ్వు చెప్పిన జీసస్ ,మోసెస్ ల పేర్లు ఈ ప్రపంచానికి పరిచయం అయ్యి 2000 సంవత్సరాలే, కానీ అంతకంటే ముందే మన నదులకు ఈసా,మూసా,మూసి అనే పేర్లు వున్నాయన్నారు.


అక్కడ మానవ జాతి ఉన్నది, ఇది భారతీయ చరిత్ర. ఇక్కడ మూసి అనేది ఒకటి ఉందని కూడా వాళ్ళకి (జీసస్ ,మోజెస్ ) లకు తెలిసే అవకాశం లేదు, నువ్ జెప్పిన మగ్గా (మక్కా) మసీదు నిర్మాణం జరిగి బహుశా నాలుగు వందల సంవత్సరాలు(1693)కూడా నిండలేదు.కానీ వేల సంవత్సరాల క్రితమే మూసి వెంట తెలంగాణ(భారతీయ)నాగరికత వెళ్ళి విరిసింది.నీళ్ళ వెంట మానవ నాగరికతలు వస్తాయి గానీ,మతాల కోసం నదులు పుట్టవ్. దయచేసి ఇకనుండి అయినా తెలిసింది మాత్రమే మాట్లాడు,లేదా నీకు స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళని అయినా మార్చుకో, కానీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల, పది కోట్ల తెలుగు ప్రజల పరువు మాత్రం తియ్యకు ప్రపంచం ముందు అంటూ ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version