ఓడినా.. మీ గుండెల్లో నేనున్నా: జానారెడ్డి

-

అధికారంలో ఉన్నా లేకున్నా.. ప్రజల హృదయాల్లో మాత్రం తాను చిరకాలం నిలిచిపోతానని కాంగ్రెస్ అగ్రనేత, సీఎల్పీ మాజీ నాయకుడు జానా రెడ్డి అన్నారు. తెలంగాణలో రాచరిక పాలనను అంతం చేయాలంటే ప్రజలంతా కాంగ్రెస్​కు ఓటు వేసి పట్టం కట్టాలని కోరారు. కేసీఆర్ నియంత పాలన నుంచి విముక్తి కలిగించే శక్తి కాంగ్రెస్​కు మాత్రమే ఉందని తెలిపారు. సాగర్‌ పైలాన్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జానా రెడ్డి పాల్గొన్నారు.

‘సాగర్‌ ప్రజలు నన్ను రెండుసార్లు ఓడించినా నేను వారి హృదయాల్లో ఉన్నాను. అందుకు నిదర్శనమే ఇక్కడ ప్రజలు. నేను అధికారంలో ఉన్నప్పడు సాగర్‌ అభివృద్ధికి కృషి చేశాను. ముఖ్యంగా విద్యుత్తు ఛార్జీలు చెల్లించలేని వారి రూ.లక్షలు రద్దు చేయించాను. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైంది. నేను చేయగా మిగిలిన అభివృద్ధిని జైవీర్‌రెడ్డి పూర్తి చేస్తాడు. అత్యధిక మెజార్టీతో నా కుమారుడిని గెలిపించాలి.’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ప్రజలను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news