BRS మళ్లీ గెలిస్తే.. బతుకమ్మపై లిక్కర్ బాటిల్ పెడతారు: జీవన్‌రెడ్డి

-

BRS మళ్లీ గెలిస్తే.. బతుకమ్మపై లిక్కర్ బాటిల్ పెడతారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS పార్టీపై కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి కీలక వాక్యాలు చేశారు. ‘గతంలో ఐదేళ్లు ఎంపీగా ఉన్న కవిత షుగర్ ఫ్యాక్టరీ మూసి వేయించారు. ఇదేనా ఆమె అభివృద్ధి? గతంలో ఎలిజిబెత్ క్వీన్ ఉండేది. ఇప్పుడు లిక్కర్ క్వీన్ వచ్చింది.

మళ్ళీ బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే…. బతుకమ్మపై లిక్కర్ బాటిల్ పెడతారు. గుమ్మడి పువ్వు గౌరమ్మ బదులు… విస్కీ బాటిల్ పెడతారు’ అని ఆయన వాక్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు.

ఇది ఇలా ఉండగా, తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయింది. 55 మందితో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ విడుదల చేసింది. ఇందులో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆయన కుమారుడికి సీట్లు దక్కాయి. మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ దక్కగా.. మెదక్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్‌రావు సీటు దక్కించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news