కాంగ్రెస్ వైఖరిపై కంటతడి పెట్టిన జీవన్ రెడ్డి !

-

కాంగ్రెస్ వైఖరిపై కంటతడి పెట్టుకున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ మానిఫెస్టోలో ఎమ్మెల్యే పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేస్తామని పెట్టి, ఇప్పుడు పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమోషనల్‌అయ్యారు. ఇన్నేండ్లు ఎవరి మీద కొట్లాడానో వారినే నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారు…నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని ప్రకటించారు. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్తాపానికి గురై బాధ పడుతున్నారని… ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చింది.

Jeevan Reddy shed tears on the attitude of the Congress

40 ఏళ్ల నా సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా. ఇంకా నాకు ఈ పార్టీ ఎందుకు.. ఈ ఎమ్మెల్సీ పదవి ఎందుకు అన్నారు. శాసనసభలో సంఖ్యా బలం పెంచుకోవడం కోసం ఏకపక్షంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం అని చెప్తున్నారు.. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వెల్లడించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news