నోవాటెల్ హోటల్ లో రాష్ట్ర నేతలతో జేపీ నడ్డా సమావేశం

-

రాష్ట్ర బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు సాయంత్రం 6 గంటలకు సమావేశం కానున్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో పార్టీ నేతలతో భేటీ కానున్నారు జేపీ నడ్డా. ఈ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం పై చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే జేపీ నడ్డా బిజెపి కార్యాలయంలో 11 రాష్ట్రాల అధ్యక్షులతో సమావేశం అయ్యారు.

ఇక ఈ సమావేశం అనంతరం ఈరోజు రాత్రికి నోవాటెల్ హోటల్ లోనే ఆయన బస చేయనున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం విశేషం. ఇలా వరుస బహిరంగ సభలు, భేటీలు, సమావేశాలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ.

Read more RELATED
Recommended to you

Latest news