తెలంగాణ బీజేపీ నేతలకు జేపీ నడ్డా ఫోన్‌

-

తెలంగాణ బీజేపీ నేతలకు జేపీ నడ్డా ఫోన్‌ చేశారు. ‘‘మహిళా గోస – బీజేపీ భరోసా’’ దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు ఫోన్ చేశారు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ‘‘మహిళా గోస – బీజేపీ భరోసా’’ దీక్ష చేస్తున్న బండి సంజయ్, డీకే అరుణలను అభినందించారు జేపీ నడ్డా.

తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ దీక్ష చేయడం అభినందనీయమన్నారు జేపీ నడ్డా మహిళా సమస్యలపై పోరాడుతున్న తీరు భేష్ అంటూ జేపీ నడ్డా కితాబు ఇచ్చారు. తెలంగాణ మహిళలకు బీజేపీ జాతీయ నాయకత్వం అండగా ఉందనే భరోసా ఇవ్వాలని బండి, డీకే లకు సూచించిన జేపీ నడ్డా… మహిళా సమస్యల పరిష్కారం కోసం మరింతగా పోరాడాలని నేతలకు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news