చాయ్ తాగడానికే కోమటిరెడ్డి ఇంటికి వచ్చా – జూపల్లి

-

నేడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో భేటీ అయ్యారు జూపల్లి కృష్ణారావు. ఈ భేటీలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సైతం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ముఖ్య నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు జూపల్లి. ఈ నేపథ్యంలోనే నేడు కోమటిరెడ్డి తో సమావేశం అయినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని వీడి వెళ్లిన వారంతా తిరిగి పార్టీలో చేరాలని ఆహ్వానించామని తెలిపారు.

కానీ జూపల్లి కృష్ణారావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదన్నారు. ఇక ఈ భేటీ అనంతరం జూపల్లి మాట్లాడుతూ.. ఏ పార్టీలో చేరాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు అన్నారు. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు జూపల్లి. అయితే కోమటిరెడ్డి ఇంటికి కేవలం చాయ్ తాగడానికి మాత్రమే వచ్చానని చెప్పడం కోసం మెరుపు.

Read more RELATED
Recommended to you

Latest news