Viral Video: బైక్‌పై పిండి మిల్లు.. ఏమి ఐడియా బాసూ.. వీడియో వైరల్..

-

ఆలోచన ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు అని చాలా మంది నిరూపించారు.. తాజాగా ఓ వ్యక్తి కూడా సాధ్యం కానిదాన్ని సుసాధ్యం చేసి చూపించారు.. ఆయన ఆలోచనకు నెటిజన్లు ఓ రేంజులో ఫిదా అవుతున్నారు.. అందుకు సంబందించిన వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ లుక్ వేద్దాం పదండీ..

వైరల్ అవుతున్న వీడియో లో ఓ వ్యక్తి తను సృష్టించిన పిండి మిల్లుతో నిలబడి ఉన్నాడు. బైక్ పైన మెషిన్ ను అమర్చుకున్నాడు. తరువాత ఆ యువకుడు పిండి మిల్లులో కొన్ని శనగగింజలను వేశాడు. కొన్ని సెక వచ్చింది.  కొన్నిసెకన్లలో పిండి వచ్చింది.. ఈ వీడియోను ఓ అధికారి సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.. అతడి ఆలోచన బాగుందని ప్రశంసలు అందుకుంటుంది..

మరికొందరు ఆ వ్యక్తి కష్టాన్ని చూసి చలించిపోయారు. అదే సమయంలో చాలా మంది ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని ఆసక్తిని చూపించారు. అయితే గ్రామంలో ఇలాంటి దృశ్యాలు మామూలే అని కూడా కొందరు అంటున్నారు… అతన్ని చూస్తే జాలి వేస్తుంది, పొట్ట కూటి కోసం చేస్తున్న కష్టం అందరిని ఆకట్టుకుంటుంది.. దాంతో ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఆలస్యం ఎందుకు.. అతని ఐడియా ఎలా ఉందో మీరు ఒక కామెంట్ వేసుకోండి.. ఇలాంటి వాళ్ళు బీహార్ లో ఎక్కువగా జరుగుతుంటాయి.. నిజంగా గ్రేట్ కదా.. హ్యాట్సఫ్ బాసూ…

Read more RELATED
Recommended to you

Latest news