కొల్లాపూర్​ నుంచి పోటీకి జూపల్లి దరఖాస్తు

-

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అరాచకం భూ కబ్జాలు పెట్రేగిపోతున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ అమరవీరుల రక్తపు కూడు తింటున్నారని ఆరోపించారు. గాంధీభవన్‌లో మాట్లాడిన అయన కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్​పై విరుచుకుపడ్డారు.

సీఎం కేసీఆర్ ఆఘమేఘాల మీద 115సీట్లకు అభ్యర్థులను ప్రకటించారని…దాని వల్ల ప్రజలకు ఏం ఒరిగిందని జూపల్లి ప్రశ్నించారు. ఇప్పటి నేతలంతా గతంలోనే పోటీ చేశారని కానీ ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా అభివృద్ధి అటకెక్కిందని విమర్శించారు. మైనంపల్లి హన్మంతరావు తిరుపతి వెంకటేశ్వరుని సాక్షిగా మాట్లాడారని.. కేసీఆర్‌కు మైనంపల్లి దెబ్బ భలే తగిలిందని.. పట్నం మహేందర్ కూడా పౌరుషం చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నానని చెప్పడంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఓటమి భయం పట్టుకుందనే విషయం స్పష్టంగా అర్థమైపోతోందని జూపల్లి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news