YSR కు పట్టిన గతే కేసీఆర్‌ కు పడుతుంది – కేఏ పాల్‌ సంచలనం

-

సీఎం కేసీఆర్ కు కేఏ పాల్ శాపం పెట్టారు. కేసీఆర్ మారకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాకుండా కేసీఆర్ అప్రమత్తమయ్యారని, అందుకోసం రూ.వందల కోట్ల డీల్ జరుగుతోందని వాక్యానించారు.

డబ్బుతో అన్ని కొనలేరని, కవితను అరెస్టు నుంచి తప్పించలేరని తెలిపారు. త్వరలో కవిత అరెస్టు కావడం ఖాయమని కేఏ పాల్ జోస్యం చెప్పారు. రాష్ట్ర గవర్నర్ పై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేయడాన్ని పాల్ తప్పు పట్టారు. గవర్నర్ పై ఇంత కక్ష ఎందుకు అని ప్రశ్నించారు. రూ. కోట్ల డబ్బులు లాయర్లకు ఇచ్చి గవర్నర్ పై సుప్రీంలో వాదించాల్సిందిగా కెసిఆర్ ఢిల్లీకి పంపించారని చెప్పారు. తాను ఎన్నిసార్లు చెప్పినా కేసీఆర్ మారడం లేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి పట్టిన గతే పడుతుందని పాల్ శపించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news