కాళేశ్వరం అవినీతిని త్వరలోనే బయటపెడుతాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

-

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై న్యాయ విచారణ జరిపించాలని.. ప్రభుత్వం పై భారం పడకుండా గుత్తెదారుతో కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్దరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. శాసన మండలిలో గవర్నర్ తమిళి సై ప్రసంగంపై ధన్యవాద తీర్మాణాన్ని ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జీవన్ రెడ్డి మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను గత ప్రభుత్వం సాగునీటి కోసం వినియోగించకుండా పర్యాటకంగా వాడుకుందని ఆరోపించారు.

మిషన్ భగీరథ పథకం కూడా కమీషన్ల ప్రాజెక్టే. అన్ని వసతులున్నా.. రామగుండం కాదని యాదాద్రిలో పవర్ ప్లాంట్ పెట్టారు. విద్యుత్ విభాగంలో రూ.80వేల కోట్ల అప్పులున్నాయి. కాళేశ్వరం, మిషన్ భగీరథపై విచారణ జరిపించాలి. ఐటీఐఆర్ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రం పేర్కొంటుంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలి. కేంద్రం వివక్ష వల్ల జాతీయ హోదా సాధించలేకపోయాం. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుకట్ట వేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news