కాంగ్రెస్​లో చేరిన కామారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఇందుప్రియ

-

కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడి రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇక ఇక్కడ కూడా పార్టీ నేతల జంపింగులు షురూ అయ్యాయి. తాజాగా కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా భర్త… గడ్డం చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తతో కలిసి ఇవాళ కలిసి కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. వారిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి,  మాజీ మంత్రి షబ్బీర్ అలీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రాష్ట్రంలో ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న కొద్ది ఒకపార్టీ నుంచి మరోపార్టీకి నేతల ఫిరాయింపులు పెరుగుతూనే ఉన్నాయి. పార్టీలో ఆశించిన స్థానం లభించక కొందరు, పక్క పార్టీలో సముచిత స్థానాన్ని కాంక్షించి మరికొందరు ఇలా పార్టీలు, జెండాలు మారుస్తూనే ఉన్నారు. తాజాగా భారాస పార్టీ నుంచి కామారెడ్డి మున్సిపాలిటీ వైస్‌ ఛైర్మన్‌ ఇందుప్రియ, సహా కౌన్సిలర్లు ఇతర నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో ఎవరూ ఎప్పడు పార్టీ మారుతారనేది తెలియక నేతలు విస్మయానికి గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news