నీలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల చిన్నారి అపహరణ.. నిందితులు అరెస్ట్..!

-

నీలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల చిన్నారి అపహరణకు గురైన విషయం తెలిసిందే. తన ఇద్దరు కుమారులతో కలిసి నీలోఫర్ ఆసుపత్రికి వచ్చింది గండిపేట కు చెందిన ఫరీదా బేగం. నాలుగేళ్ల పెద్దబాబు చికిత్స కోసం.. ఆరు నెలల చిన్న కుమారుడి తో పాటు నీలోఫర్ కు వచ్చింది ఫరీదా బేగం. ఫరీదా, ఫరీదా తల్లితో మాటలు కలిపింది అనుమానితురాలు. భోజనం వాహనం రావడం తో.. ఆరు నెలల చిన్న బాబును పడుకోబెట్టి..పది నిముషాలు వెళ్లింది ఫరీదా తల్లి.

భోజనంతో వచ్చేసరికి ఆరు నెలల బాబు మాయమయ్యాడు. ఉదయం నుంచి తనతో మాట్లాడుతున్న మహిళే..తీసుకెళ్ళింది అంటూ పక్కన వున్న వారికి చెప్పింది. ఇక నాంపల్లి పోలీస్ లకు కూడా ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఎట్టకేలకు పోలీసులు దాదాపు పది రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన ఆరు నెలల పసిబాలుడు ఎట్టకేలకే తల్లిచెంతకు చేరాడు. నిజామాబాద్‌లో కిడ్నాపర్లను గుర్తించారు పోలీసులు. వారి నుంచి బాబును రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఆసుపత్రిలో బాలుడి తల్లి ఫరీదా బేగంతో స్నేహం చేసిన మహిళ పసిబిడ్డను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. సీసీటీవీ ఫుటేజ్‌లో మహిళ పాపను ఎత్తుకెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. బాలుడి తల్లి ఫరీదాకు మాయమాటలు చెప్పి నిందితురాలు ఈ కిడ్నాప్ చేసిందని గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news