MODI 3.0: ఒకే కారులో వెళ్లిన కిషన్ రెడ్డి, బండి సంజయ్..

-

కేంద్ర కేబినెట్లో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. దీంతో బీజేపీ తెలంగాణ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర కేబినేట్‌ చోటు దక్కింది. ఇందులో భాగంగానే వీరిద్దరికి PMO నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. కిషన్ రెడ్డి నివాసం నుంచి ఒకే కారులో ప్రధాని నివాసంలో జరిగే తేనీటి విందుకు బయలుదేరారు కిషన్ రెడ్డి, బండి సంజయ్.

Kishan Reddy, Bandi Sanjay

ఇందులో టీడీపీ నుంచి ఇద్దరికీ ఛాన్స్‌ వచ్చిందట. కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ల పేర్లు ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. దగ్గుబాటి పురంధరేశ్వరి (బీజేపీ), వల్లభనేని బాలశౌరి (జనసేన) లకు ఛాన్స్‌ వచ్చినట్లు సమాచారం. ఈ నలుగురు ఏపీ నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news