మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్‌రెడ్డి

-

ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తాము ఎవరికీ బీ టీం కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ నేడు నామినేషన్‌ సందర్భంగా ఆయన నివాసంలో నిర్వహించిన సమావేశంలో కిషన్‌ రెడ్డి మాట్లాడారు.

‘తెలంగాణలో 12కు పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. రాజకీయంగా ఈటల అనేక ఉద్యమాలు చేశారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మల్కాజిగిరిలో ఆయన్ను గెలిపిద్దాం. ఐకమత్యంతో పనిచేయాలి. నామినేషన్‌ వేసిన తర్వాత డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ చేయాలని అధిష్ఠానం సూచించింది. కేడర్ అంతా ప్రచారంలో పాల్గొనాలి. ఇప్పటి వరకు దేశానికి ఏం చేశాం.. ఏం చేయబోతున్నామనేది ప్రజలకు వివరించాలి. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా కీలకం. అక్కడ పార్టీ అభ్యర్థి వంశ తిలక్‌ను గెలిపించాలి. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు.. ఈ విషయంలో నాకు పూర్తి విశ్వాసముంది. కాంగ్రెస్‌ ఏం చేసినా మన గెలుపును ఆపలేదు.’ అని కిషన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news