కాసేపట్లో నిర్మల్ చేరుకోనున్న కిషన్ రెడ్డి

-

నిజామాబాద్ జిల్లా: నిర్మల్ పట్టణ కేంద్రంలో మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు మహేశ్వర్ రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతు తెలపడానికి కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి కాసేపట్లో నిర్మల్ కి చేరుకోనున్నారు. అయితే మార్గమధ్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్లో పట్టణ నాయకులు కిషన్ రెడ్డి వాహనాన్ని ఆపి ఆయనను సన్మానించారు.

రైతుల నుండి బినామీ పేర్లపై రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కబ్జాలకు పాల్పడ్డారని కిషన్ రెడ్డికి వివరించారు రైతులు, బిజెపి నాయకులు. దీంతో రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తో పాటు కార్యకర్తలపై చేసిన దాడిని ఆయన ఖండించారు. బిజెపి కార్యకర్తలు, నాయకులపై జరిగిన విచక్షణ రహితమైన లాఠీచార్జిని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశత్వాన్ని ఆయన ఖండించారు.

Read more RELATED
Recommended to you

Latest news